హుస్నాబాద్ లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం
హుస్నాబాద్
Minister Ponnam exercising his right to vote along with his family members in Husnabad
హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ లో ఓటు అనేది ఆయుధం. ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం ఓటర్లు ఓటు వేస్తున్నారు అర్బన్ ప్రాంతాల్లో అవగాహన తక్కువ ఉంది. 116 మున్సిపాలిటీ లు ,7 కార్పొరేషన్ లలో ప్రతి అర్బన్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్న. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి పట్టణ ఓటర్లు తమ విచక్షణ తో ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజా ప్రతినిధి నీ ఎక్కుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న.
ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో జీవించి ఉన్నట్లు కాదని నానుడి చెప్తారు. అర్బన్ లో అనేక పనులు ఉన్నప్పటికీ వెసులుబాటు చేసుకొని తమ ఓటు వినియోగించుకోవాలి అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోండి ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు.


