లలితా జ్యువెలరీ 55వ షోరూంను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.
Minister Sridhar Babu inaugurated the 55th showroom of Lalitha Jewellery.
Aug 26, 2024,
లలితా జ్యువెలరీ 55వ షోరూంను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.
ఈ నెల 18న హైదరాబాద్ లోని సూచిత్రా సర్కిల్ లో గల లలితా జ్యువెలరీ 55వ నూతన షో రూం మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు.. లలితా జ్యువెలరీ ద్వారా ఎంతో మందికి ఉపాధి కలగడమే కాకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించి ప్రజలకు బంగారాన్ని, వెండిని అందుబాటులో ఉంచుతున్నారన్నారు. లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ మాట్లాడుతూ చదువుకున్న వారికి ఐటీ ఉద్యోగాలు వస్తాయి కానీ, చదువులేని వారికి ఉపాధి కల్పించే విధంగా తమ సంస్థలు పనిచేస్తాయని తెలిపారు. రాబోయే 2 నెలల్లో వరంగల్,మిర్యాలగూడ,ఖమ్మం నగరాల్లో షో రూములు ప్రారంభించబోతున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు.



