- Advertisement -
రాజీవ్ గాంధీ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రులు పొంగులేటి, పొన్నం
Ministers inspect Rajiv Gandhi premises
హైదరాబాద్
సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పరిశీలించారు. ఈ నెల 20 వ తేది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు ఏర్పాటు చేస్తున్న రాజీవ గాంధీ విగ్రహావిష్కరణ ఉండడం తో పనులను పరిశీలించారు మంత్రులు. ఇప్పటికే విగ్రహ ఏర్పాటు పూర్తైనందున ల్యాండ్ స్కేపింగ్ ఇతర పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలుఇచ్చారు. రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణ మ్యాప్ ను పరిశీలించి పలు సూచనలు చేసారు.
- Advertisement -