- Advertisement -
ఎల్బీనగర్, వాయిస్ టుడే: ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ లో శనివారం సాయంత్రం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై ఆడపడుచులతో కలిసి కోలాటం ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ పండుగలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. అంతకుముందు ఆడపడుచులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -



