- Advertisement -
నాగర్ కర్నూల్: కొల్లాపూర్ వేదికగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా పత్రాన్ని ఫాక్స్ ద్వారా అందజేశారు. ఈ నెల 31న కొల్లాపూర్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. అదేరోజు ఎమ్మెల్సీ పదవికి కూడా కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. గడిచిన నాలుగున్నర ఏళ్లలో పది సార్లు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరిన ఇవ్వలేదని ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డిఅరోపించారు. .
- Advertisement -



