Sunday, March 22, 2026

మోడీ బ్రహ్మ-చంద్రబాబు విష్ణుమూర్తి -పవన్ పరమశివుడు

- Advertisement -

రసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రజాగళంలో భాగంగా గోదావరి జిల్లాలోని పాలకొల్లులో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో రఘురామ కృష్ణంరాజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆయనకు కండువా కప్పిచంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎంపీ రఘురామ కృష్ణంరాజును మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రజలను విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు. రేపు తీసుకోబోయే నిర్ణయానికి ప్రజలంతా ఆమోదం తెలిపి రఘురామను ఆశీర్వదించాలన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో రఘు రామకృష్ణంరాజు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేదానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. నరసాపురం లోక్‌సభకు కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన శ్రీనివాసవర్మను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మార్పుపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తప్పనిసరి పక్షంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించుతారనే చర్చ కూడా జరుగుతుంది. ఇకపోతే తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం రఘురామ కృష్ణంరాజు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు కాపాడింది చంద్రబాబు నాయుడేనని కొనియాడారు. ఈ క్రమంలో తాను ఎప్పటికీ చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

చంద్రబాబు వల్లే నేను మీ ముందు బతికున్నా

తెలుగుదేశం పార్టీలో చేరడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అభిమానులకు, జనసేన అభిమానులకు, బీజేపీ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు.’గతంలో నా ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు కాపాడింది చంద్రబాబే. ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా, న్యాయవాదులతో మాట్లాడడమే కాకుండా, నా కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పారు. తొందరపడొద్దమ్మా… ఏమీ కాదు, నేను ఉన్నాను అని నా భార్యకు, నా కుమార్తెకు, నా కొడుకుకు ధైర్యం చెప్పారు. నేను ఉన్నాను, విన్నాను అని కొందరు సొల్లు కబుర్లు చెబుతారు. చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు. నా బాధ విన్నారు కాబట్టే ఆయన ఇవాళ చెప్పినట్టు నేను మీ ముందు బతికున్నా. అందుకే చంద్రబాబుకు నేనెంతో రుణపడి ఉన్నాను’అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.

త్రిమూర్తులు ప్రభంజనం సృష్టించబోతున్నారు
రాష్ట్రంలో నెలకొన్ని కొన్ని కారణాల వల్ల తాను నాలుగేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చింది అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇవాళ చంద్రబాబు చొరవతో మళ్లీ మీ ముందుకు వచ్చాను. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని ప్రజలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే జూన్ 4న చంద్రబాబు, పవన్ కల్యాణ్, నరేంద్రమోదీ ప్రభంజనం సృష్టించబోతున్నారు అని జోస్యం చెప్పుకొచ్చారు. ఈ త్రిమూర్తుల కలయిక ఉంటుందని నేను సంవత్సరంగా చెబుతూనే ఉన్నాను. ఇందులో మోడీ బ్రహ్మ అయితే, విష్ణుమూర్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరమశివుడుగా అభివర్ణించారు. మనమందరం సైనికులం… జై టీడీపీ, జై చంద్రబాబు, జై పవన్ కల్యాణ్, జై నరేంద్ర మోడీ అంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భావోద్వేగపూరితంగా ప్రసంగించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్