సహస్ర చండీకా మహాయజ్ఞానికి ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం
MP Vaddiraju Invited to Sahasra Chandika Mahayagna
హైదరాబాద్: కర్నాటక రాజధాని బెంగళూరులోని అనెకల్ శ్రీశంకరాచార్య ఆశ్రమం పరిధిలో ఉన్న శ్రీసాయి రుక్మిణీ మహల్ ప్రాంగణంలో ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు సహస్ర చండీకా మహాయజ్ఞం ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ మహాయజ్ఞానికి హాజరు కావలసిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించారు. బెంగళూరుకు చెందిన న్యూ బెల్డవిన్ విద్యాసంస్థలు మరియు శ్రీ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మహాయజ్ఞం జరగనుంది.
న్యూబెల్డవిన్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ కే. వేణుగోపాల్, కొణిదెల చంద్రకాంత్ లు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర క్యాంప్ కార్యాలయంలో కలిసి మహాయజ్ఞం ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజుతో పాటు ఆయన సన్నిహితులు మరికల్ పోత సుధీర్ కుమార్ను కూడా వేణుగోపాల్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.



