స్వర్గీయ బండారు సూరయ్యకు నివాళులర్పించిన ఎంపీ వద్దిరాజు
Date 24/09/2025
MP Vaddiraju pays tribute to late Bandaru Suraya

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ,మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నాయకుడు శీలంశెట్టి వీరభద్రం తదితర ప్రముఖులతో కలిసి స్వర్గీయ బండారు సూరయ్యకు ఘనంగా నివాళులర్పించారు.ఖమ్మం రూరల్ మండలం గుడిమళ్ల వాస్తవ్యులు సూరయ్య ఈనెల 20వతేదీన మృతి చెందడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర బుధవారం ఉదయం గాంధీ, వీరభద్రం తదితర ప్రముఖులతో కలిసి గుడిమళ్లలో సూరయ్య చిత్రపటానికి పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించి, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.స్వర్గీయ సూరయ్య సతీమణి వెంకమ్మ,కుమారులు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, వెంకట్రామయ్య, ఉపేందర్,మనవడు ఉదయ్ కుమార్ తదితర కుటుంబ సభ్యులను ఎంపీ రవిచంద్ర, గాంధీ, వీరభద్రంలు పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
స్వర్గీయ బండారు సూరయ్యకు నివాళులర్పించిన ఎంపీ వద్దిరాజు
- Advertisement -
- Advertisement -


