బీఆర్ఎస్ అభ్యర్థి సునీత తో కలిసి ఎంపీ వద్దిరాజు ఎన్నికల ప్రచారం
MP Vaddiraju’s election campaign with BRS candidate Sunitha

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గంలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత తదితర ప్రముఖులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఎంపీ రవిచంద్ర,సునీతలు కార్పోరేటర్స్ రాజ్ కుమార్ పటేల్,హేమ, నాయకులు ఆశీస్ కుమార్ యాదవ్, వాసాల వెంకటేష్,పర్వతం సతీష్,నర్సింగ్ తదితర నాయకులతో కలిసి మంగళవారం సాయంత్రం యూసఫ్ గూడ మెట్రో స్టేషన్,చెక్ పోస్ట్, లక్ష్మీనరసంహా నగర్, ప్రగతినగర్ తదితర చోట్ల కాలినడకన ఎన్నికల ప్రచారం జరిపారు.వారు గడపగడపకు వెళ్లి బీఆర్ఎస్,కారు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తూ “బాకీ కార్డు”లను ఓటర్లకు అందజేశారు.ఈ సందర్భంగా స్థానిక మహిళలు సునీతకు బొట్టు పెట్టి, శాలువాలతో సత్కరించి ఆత్మీయ స్వాగతం పలికారు.యువత పలుచోట్ల “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి”,”కారు గుర్తుకే మన ఓటు”,”అమర్ హై అమర్ హై మాగంటి గోపన్న అమర్ హై”అంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.


