- Advertisement -
కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈనెల ఐదవ తేదీన జరిగే బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభాస్థలి”ని, హెలిప్యాడును రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్థానిక ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుతో కలిసి శనివారం పరిశీలించారు, పనులను పర్యవేక్షించారు. వేదిక,సభాస్థలిఏర్పాటు, సభికులకు ఎండ తగులకుండా పటిష్టమైన టెంట్లు వేయడం,వాహనాల పార్కింగ్ స్థలాలు,ప్రగతి మైదానంలో హెలిప్యాడును వారు పరిశీలించారు.పనుల పురోగతిని పరిశీలించి,ఇంకా జరగాల్సిన వాటిని మరింత త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే వెంకటేశ్వరరావులు సిబ్బందిని ఆదేశించారు,పలు సూచనలు చేశారు,సలహాలిచ్చారు.

- Advertisement -



