కంటోన్మెంట్, అక్టోబర్ 30 (వాయిస్ టుడే ప్రతినిధి): ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రతిపక్షా పార్టీల నాయకులు భయపడుతున్నారని, ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. సోమవారం నాడు ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ పరిధిలోని, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గెలుపు కోసం, 4వ రోజు ఇంటింటా పాదయాత్ర చేస్తూ, కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ముద్ధం నరసింహ యాదవ్ మాట్లాడుతూ…. నియోజకవర్గ అభివృద్దే మాధవరం కృష్ణారావు మూడోసారి గెలిచి మంత్రి అవుతారని ఆయన తెలిపారు. ప్రజలందరూ బిఆర్ఎస్ కు మద్దతుగా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీ నాయకులు అభ్యర్థులకు డిక్లేర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్, మాక్కల నర్సింగ్ రావు, కర్రె లావణ్య, గడ్డం నర్సింగ్ రావు, ఇర్ఫాన్, హరినాథ్, లలిత, బుర్రి యాదగిరి, జాంగిర్, జె. రాజు గౌడ్, భాస్కర్, చారి, పోచయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



