Tuesday, January 14, 2025

రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

- Advertisement -

రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

Mukkoti Ekadashi celebrations at Rajanna Temple

రాజన్న సిరిసిల్ల
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతఃకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకి సేవ లో ప్రతిష్టించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. అనంతరం రంగురంగుల పూలతో అలంకరించిన అంబారి సేవపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి దేవాలయంలో మూడు ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ఆలయ ఈవో  వినోద్ రెడ్డి లతో పాటు వేలాది భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్