రేపు సాయంత్రం లోపు విధుల్లో చేరాలి

- Advertisement -

రేపు సాయంత్రం లోపు విధుల్లో చేరాలి: సుప్రీంకోర్టు*

Must join duty by tomorrow evening

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్ వైద్యులు మంగళవారం సాయంత్రం 5గంటల్లోపు తిరిగి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేకపోతే ప్రతికూల చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.

హత్యాచారం కేసుపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పశ్చిమ బెంగాల్‌లో 28రోజులుగా డాక్టర్లు సమ్మె చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

బెంగాల్‌ డాక్టర్లు తమ నిరసన విరమించాలని చంద్రచూడ్ మరోసారి కోరారు. ఈ సందర్భంగా వారి భద్రతకు హామీ ఉంటుందన్నారు.

మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు వైద్యులు విధు ల్లో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వైద్యులు విధుల్లోకి రాక పోతే.. వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular