Sunday, September 8, 2024

గోవాలో జాతీయ క్రీడలు ప్రారంభించిన నరేంద్రమోదీ

- Advertisement -

పనాజీ : అక్టోబర్ : గోవాలో ఈరోజు గురువారం జాతీయ క్రీడల సంబరం మొదలు కానుంది. గోవా రాష్ట్రం జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. గోవాలోని ఐదు ప్రధాన నగరాల్లో రెండేసి ప్రదేశాల చొప్పున మొత్తం 10 ప్రాంతాల్లో ఈ 37వ ఎడిషన్‌ జాతీయ క్రీడలు జరుగనున్నాయి.

దాదాపు 10 వేల మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. సుమారు 2.5 లక్షల మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. అక్టోబర్‌ 26న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ జాతీయ క్రీడలు.. నవంబర్ 9న ముగియనున్నాయి.

Narendra Modi inaugurated the National Games in Goa
Narendra Modi inaugurated the National Games in Goa

గోవాలోని మపుసా, మార్గావ్‌, పంజిమ్‌, పోండా, వాస్కో నగరాలు ఈ జాతీయ క్రీడల కోసం క్రీడా గ్రామాలుగా మారిపోయాయి. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ బుధవారం ఈ క్రీడా గ్రామాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఈ 37వ ఎడిషన్‌ జాతీయ క్రీడల్లో 10 వేల మంది ఆటగాళ్లు 43 క్రీడా విభాగాల్లో పోటీ పడనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్