Saturday, February 8, 2025

తెలంగాణకు కొత్త ఎయిర్ పోర్టులు

- Advertisement -

తెలంగాణకు కొత్త ఎయిర్ పోర్టులు

New Airports for Telangana

హైదరాబాద్, ఫిబ్రవరి 3, (వాయిస్ టుడే)
తెలంగాణలో ఎయిర్‌పోర్టులు చాలా తక్కువ. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో నాలుగు, ఐదు ఎయిర్‌పోర్టులు ఉంటే.. రాష్ట్రంలో మాత్రం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఎక్కటే దిక్కు. బేగంపేట ఎయిర్‌పోర్టు వీఐపీల కోసం వినియోగిస్తుండగా.. వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్టు నిజాం కాలంలో సేవలందించేది. ప్రస్తుతం మాత్రం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మాత్రమే విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఎయిర్ పోర్టులు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక ప్రకటన చేశారు. పొరుగు రాష్ట్రాల్లో బస్ డిపోల మాదిరిగా ప్రతి 150 కి.మీ ఎయిర్‌పోర్టులు ఉంటే తెలంగాణలో మాత్రం అందుబాటులో లేవని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మేరకు వరంగల్ మామునూరు, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు నిర్మించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరుకు కేంద్రానికి ప్రతిపాదనలు సైతం పంపించారు.తాజాగా.. తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. తాజా కేంద్ర బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా… 120 కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని నాలుగు ప్రతిపాదిత ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ప్రస్తుతం వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టుకు 696.14 ఎకరాల భూమి ఉంది. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు మరికొంత భూమి అవసరమని AAI రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో 253 ఎకరాలను ఎయిర్‌‍పోర్టు నిర్మాణానికి అదనంగా కేటాయింలు చేసింది. ఇక్కడ బ్రౌన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు అడుగులు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.ఇక కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడ కూడా ప్రభుత్వ భూములు భారీగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మించనుండగా.. ఏఏఐ బృందం ఇప్పటికే ఫీజిబిలిటీ పరీక్షలను నిర్వహించింది. కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేస్తామని తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వరంగల్ మామునూరు, కొత్తగూడెం ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఈ ఏడాదిలోనే అడుగులు పడనున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్