కొత్త నియోజకవర్గాలు… కలిసొచ్చేదెవరికి
కరీంనగర్, మార్చి 30,(వాయిస్ టుడే )
New Constituencies… Who Stands to Gain?
కేంద్రం ఇటీవల నియోజకవర్గాల పునర్విభజనకు అనుమతి ఇచ్చింది. జనాభా ఆధారంగా పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు రావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న స్థానాల్లో 50 శాతం పెంచాలని ప్రతిపాదించింది. దీంతో తెలంగాణలో ప్రస్తతం 119 స్థానాలు ఉండగా కొత్తగా 60 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా 5 స్థానాలు పెరగబోతున్నాయి. దీంతో కరీంనగర్ జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సరిహద్దులు మారిపోవడం ఖాయం. దశాబ్దాలుగా ఒకే నియోజకవర్గంలో పట్టు సాధించిన నాయకులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే తమ సామాజిక సమీకరణాలు కలిసొస్తాయని, తమ రాజకీయ కల నెరవేరుతుందని ద్వితీయ శ్రేణి నేతలు ఆశపడుతున్నారు. ఈ చదరంగంలో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది ఆసక్తికర అంశంగా మారిందఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం 13 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు, ఒక పార్లమెంటు స్థానాన్ని కలిగి ఉంది. ఈ నియోజకవర్గాల్లో కొన్ని దశాబ్దాలుగా ఒకే పార్టీ లేదా ఒకే కుటుంబం ఆధీనంలో ఉన్నాయి. సామాజిక సమీకరణాలు, స్థానిక సమస్యలు, అభివృద్ధి పనుల ఆధారంగా ఓటర్లు నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ నియోజకవర్గాల పెంపు జరిగితే ఈ సమీకరణాలన్నీ మారిపోయే అవకాశం ఉంది.నియోజకవర్గాల పునర్విభజనతో దశాబ్దాలుగా ఒకే నియోజకవర్గంలో పట్టు సాధించిన సీనియర్ నేతలకు నియోజకవర్గాల పునర్విభజన పెద్ద తలనొప్పిగా మారింది. పట్టు ఉన్న ప్రాంతాలు వేరు నియోజకవర్గాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. వారికి మద్దతుగా ఉన్న ఓటు బ్యాంకు రెండు లేదా మూడు నియోజకవర్గాలుగా విభజించబడే అవకాశం ఉంది. కొత్త నియోజకవర్గాల్లో కొత్త నేతలు పోటీకి దిగే అవకాశం ఉంది.నియోజకవర్గాల పెంపు ద్వితీయ శ్రేణి నేతలకు, యువ నేతలకు పెద్ద అవకాశంగా మారింది. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుంది. తమ సామాజికవర్గం ఆధిక్యం ఉన్న ప్రాంతాలు కొత్త నియోజకవర్గంగా ఏర్పడితే, గెలుపు అవకాశాలు పెరుగుతాయి. పార్టీలు కూడా కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి.రాజకీయ పార్టీలకు నియోజకవర్గాల పెంపు వ్యూహాత్మక అవకాశంగా మారింది. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను కలిపి, కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. విభజన వల్ల అధికార పార్టీ ఓటు బ్యాంకు చీలి, తమకు లాభం చేకూరుతుందని ఆశిస్తుంది. కొత్త నియోజకవర్గాల్లో తమ ప్రాబల్యం చూపించే అవకాశం లభిస్తుంది.కరీంనగర్ జిల్లాలో వివిధ సామాజిక వర్గాలు(రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ) ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ సమీకరణాలు మారిపోతాయి. కొత్త నియోజకవర్గాల్లో ఒకే సామాజిక వర్గం ఆధిక్యం ఏర్పడితే, ఆ వర్గం నేతకు అవకాశం లభిస్తుంది. వివిధ వర్గాలు సమానంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ మరింత తీవ్రంగా మారుతుంది. ఒకే సామాజిక వర్గం ఆధిక్యం లేనప్పుడు, వివిధ వర్గాల కూటమి అభ్యర్థి గెలుపు నిర్ణయిస్తుంది.నియోజకవర్గాల పెంపు ఖాయమైతే, పార్టీల లోపల టికెట్ ఆకాంక్షలు పెరుగుతాయి. సీనియర్ నేతలు, యువ నేతల మధ్య ఘర్షణ తప్పదు. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారే అవకాశం ఉంది. ఒకే పార్టీ గెలవడం కష్టమైన నియోజకవర్గాల్లో, కూటమి రాజకీయాలు ముఖ్యమవుతాయి. వివిధ సామాజిక వర్గాల నేతలతో కూటమి ఏర్పాటు చేసుకుని, గెలుపును సాధించే ప్రయత్నం జరుగుతుంది. కొత్త నియోజకవర్గాల్లో ప్రచార వ్యూహాలు మారాల్సి ఉంటుంది. సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారం మరింత ముఖ్యమవుతుంది. స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందినియోజకవర్గాల పెంపు కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెద్ద మార్పును తీసుకురాబోతోంది. దశాబ్దాలుగా పట్టు సాధించిన సీనియర్ నేతలకు ఇది సవాలుగా మారితే, యువ నేతలకు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలకు ఇది సువర్ణావకాశంగా మారింది.



