సంగారెడ్డి నవంబర్ 9: సంగారెడ్డి, భారత చైతన్య యువజన పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేసిన న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్నామినేషన్ దాకలు చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు తనను నిండు మనసుతో ఆశీర్వదించి నామినేషన్ వేయించారని తెలిపారు. నేటి సమాజానికి సమాజం పట్ల , ప్రజాస్వామ్యం పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ప్రజా సమస్యలను తీర్చడంలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనునిత్యం ప్రజల సంక్షేమం కోరే న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ అధిక మెజార్టీతో గెలిచి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ నేతృత్వంలో సంగారెడ్డి నియోజకవర్గమును సమస్యలు లేని నియోజకవర్గము గా తీర్చిదిద్దుతానని తెలియజేశారు.



