- Advertisement -
బుల్లెట్ రైలు కాదు.. కవచ్ ముఖ్యం: మహువా మొయిత్రా
Not a bullet train.. Armor is important
బుల్లెట్ రైలు కాదు.. కవచ్ ముఖ్యం: మహువా మొయిత్రా
బీజేపీ పదేళ్ల పాలనలో 11 భారీ రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా విమర్శించారు. ఈ ఘటనల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని విమర్శించారు. రైలు ప్రమాదాలను నివారించే కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. కవచ్కు అయ్యే ఖర్చు రూ.63 వేల కోట్లు మాత్రమేనని, ప్రభుత్వం అమితాసక్తి చూపుతున్న బుల్లెట్ ట్రైన్కు రూ.1.08 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు.
- Advertisement -



