Saturday, February 15, 2025

ఆరు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

- Advertisement -

ఆరు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

Notification for six MLC elections

న్యూఢిల్లీ,, జనవరి 29
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్  విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది.అటు, తెలంగాణలో 2 ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే, వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి సైతం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
కాగా, మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ జీవన్ రెడ్డి కొనసాగుతుండగా.. ఇదే చోట టీచర్ స్థానం నుంచి కూర రఘోత్తంరెడ్డి, వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. వీరి పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది.
షెడ్యూల్ పూర్తి వివరాలివే..
నోటిఫికేషన్ విడుదల – ఫిబ్రవరి 3
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ – ఫిబ్రవరి 10
నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 11
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ – ఫిబ్రవరి 13
పోలింగ్ ప్రక్రియ – ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ..
ఓట్ల లెక్కింపు ప్రక్రియ – మార్చి 3

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్