- Advertisement -
ఆరు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్
Notification for six MLC elections
న్యూఢిల్లీ,, జనవరి 29
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది.అటు, తెలంగాణలో 2 ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే, వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి సైతం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
కాగా, మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ జీవన్ రెడ్డి కొనసాగుతుండగా.. ఇదే చోట టీచర్ స్థానం నుంచి కూర రఘోత్తంరెడ్డి, వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. వీరి పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది.
షెడ్యూల్ పూర్తి వివరాలివే..
నోటిఫికేషన్ విడుదల – ఫిబ్రవరి 3
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ – ఫిబ్రవరి 10
నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 11
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ – ఫిబ్రవరి 13
పోలింగ్ ప్రక్రియ – ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ..
ఓట్ల లెక్కింపు ప్రక్రియ – మార్చి 3
- Advertisement -