ప్రజలకు అందుబాటులో ఉండేందుకే నంద్యాల జిల్లా కేంద్రంలో ఇల్లు, ఆఫీస్ ప్రారంభం

- Advertisement -

ప్రజలకు అందుబాటులో ఉండేందుకే నంద్యాల జిల్లా కేంద్రంలో ఇల్లు, ఆఫీస్ ప్రారంభం

Opening of house & office in Nandyala district center to make accessible to people

 – ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

నంద్యాల పార్లమెంట్ సభ్యురాలుగా గెలిపించుకున్న నా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకే నంద్యాల జిల్లా కేంద్రం బొమ్మలసత్రంలో  ఇల్లు,  ఎంపీ కార్యాలయం సాధాసీధగా శుక్రవారం అర్చకులచే పూజలు చేసి ప్రారంభిచామని  నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
నంద్యాల బొమ్మలసత్రం లో అర్చకులచే శుక్రవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేసి, ఇంట్లో పాలు పొంగించి, గోవుకు పూజ చేసి ఇంట్లో కలియతిప్పి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గృహప్రవేశం, నంద్యాల పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎంపీ శబరి మాట్లాడుతూ జిల్లా కేంద్రం, పార్లమెంట్ కేంద్రం అయిన నంద్యాల పట్టణంలో  ఇల్లు, ఆఫీస్ తీసుకొని జిల్లా ప్రజలకు సేవ చేస్తా అన్నారు.
ఈ కార్యక్రమంలో  టీడీపీ నాయకులు నరహరి విశ్వనాధ్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి,  వీరసింహరెడ్డి,  గోరుకల్లు ఎరుకలయ్య, మద్దూరు గ్రామ సర్పంచ్ జి. ప్రదీప్ రెడ్డి, గణపం పుల్లారెడ్డి, కోడూరు సంజీవరెడ్డి, బొమ్మిరెడ్డి, డాక్టర్ ఎం. రామిరెడ్డి, అజయ్, గోపాల్ యాదవ్, పుసులూరు మాజీ సర్పంచ్, సతీష్ కుమార్, కానాల గురునాద్ రెడ్డి తదితరులు ఎంపీ శబరి గృహప్రవేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular