Breaking News
Saturday, July 27, 2024
Breaking News

అంగన్‌వాడీల్లో పక్షోత్సవాలు ప్రారంభం

- Advertisement -

అంగన్‌వాడీల్లో పక్షోత్సవాలు ప్రారంభం

—పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

—-పోషకాహారం అందించడమే లక్ష్యం

—-సూపర్వైజర్ మమత

తాండూర్

బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ని అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్  మమత పక్షోత్సవాలు పురస్కరించుకొని పోషకాహార విలువలపై గర్భిణీలకు, బాలింతలకు చిన్నారులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే తల్లి, బిడ్డ క్షేమంమని,గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారం పండ్లు, ఆకుకూరలు కూరగాయలు పాలు, గుడ్లు మాంసం చేపలు ఎక్కువగా తీసుకోవాలని తెలియజేశారు, దాని వలన రక్తహీనత లేకుండా సుఖప్రసవము జరుగుతుందని తెలియజేశారు.బరువు తక్కువ పిల్లలు పుట్టడం వలన వారికి ఎలాంటి అనారోగ్యం వచ్చిన తొందరగా కోలుకోలేరని పూర్తి అనారోగ్యానికి గురి అవుతారని తెలియజేశారు.బరువు తక్కువ పిల్లలకు అంగన్వాడి కేంద్రంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, వారికి అదనంగా ఒక గుడ్డు 100ఎంఎల్ పాలు బాలామృతం ప్లస్ ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నాట్లు, ప్రతినెల పిల్లల బరువులు తీయించుకొని వారి గ్రోత్ ను తెలుసుకోవాలని తల్లులకు తెలియజేశారు. విటమిన్లు మినరల్స్ అన్ని రకాల పోషకాలు గల ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెర్వో ఇమ్రాన్ ఖాన్,ఎంపీడీఓ శ్రీనివాస్,తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి ,జమున,కరుణ,విజయ ,సీత ,తిరుమలేశ్వరి,సువర్ణ,గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అంగన్వాడి ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!