- Advertisement -
*పటేల్ యూత్ గర్జన పోస్టర్ ఆవిష్కరణ*
పటేల్ యూత్ ఫోర్స్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా.. ఈ నెల 14 వ తేదీ ఆదివారం కరీంనగర్ లో జరుగనున్న
*పటేల్ యూత్ గర్జన సభ* వాల్ పోస్టర్ ను ఈ రోజు TNGO భవన్ మెదక్ లో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు శ్రీధర్ పటేల్ , మెదక్ జిల్లా కో ఆర్డినేటర్ వీర్ కుమార్ పటేల్, జిల్లా ప్రచార కార్యదర్శి నాయిని శేఖర్ పటేల్, బాధ్యులు అల్లాడి శేఖర్ పటేల్, పూల మల్లేష్ పటేల్, నాగారం సిద్దిరాములు పటేల్ మాట్లాడుతూ కరీంనగర్ లో జరిగే పటేల్ యూత్ గర్జన కు అధిక సంఖ్యలో హాజరై విజయ వంతం చేయాలని కోరారు. 1,000 మందితో కూడిన బాల బాలికల హాస్టల్ నిర్మాణం, పటేల్ గెజిట్ సాధించడం పటేల్ యూత్ గర్జన లక్ష్యమని వారు తెలిపారు. మన్నూరు కాపు పట్ ల్స్ అందరూ పటేల్ యూత్ గర్జన కు మద్దతు తెలపాలని కోరారు.02:14 PM