Wednesday, March 11, 2026

 12 నైట్  ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి

- Advertisement -

 12 నైట్  ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి
హైదరాబాద్, మార్చి 11, (వాయిస్ టుడే )

Permission Granted for 12 Night Engineering Colleges
తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ చదువులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న 12 ఇంజినీరింగ్ కాలేజీల్లో పలు రకాల బీటెక్ కోర్సులను సాయంత్రం పూట చెప్పనున్నారు. గత

కొంతకాలంగా ఈ సాయంత్రం బీటెక్ కోర్సులకు సంబంధించిన ఫైల్ పెండింగ్‌లో ఉండగా.. తాజాగా తుది ఆమోదం లభించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ఇచ్చేందుకు అనుమతినిచ్చింది. తెలంగాణ రాష్ట్ర

ప్రభుత్వం కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. విద్యా శాఖను తన వద్దే ఉంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యా శాఖకు సంబంధించి

కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణలో 12 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సాయంత్రం బీటెక్‌ కోర్సులను అందించే నిర్ణయానికి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా ఈ సాయంత్రం

ఇంజినీరింగ్ కోర్సుల ఫైల్ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండగా.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విద్యా శాఖ జీఓ నంబర్ 30ని జారీ చేస్తూ ఉత్తర్వులు

వెలువరించింది.ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 కాలేజీల్లో ఈ ఈవెనింగ్ బీటెక్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కాలేజీకి 1 నుంచి 5 కోర్సులు చెప్పేందుకు అనుమతులు మంజూరు చేశారు. ఇక ఒక్కో

కోర్సులో తక్కువలో తక్కువగా 15 సీట్లు.. ఇక అత్యధికంగా 60 సీట్లకు అవకాశం కల్పించారు. ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఈ కాలేజీల్లో ప్రవేశాలు జరుపుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.పాలిటెక్నిక్‌ కోర్సులు పూర్తి చేసి.. కనీసం ఏడాది పాటు ఉద్యోగం చేసిన అనుభవం ఉన్నవారు ఈ బీటెక్‌

కోర్సులో చేరొచ్చని అధికారులు వెల్లడించారు. ఒకవేళ ఇప్పటికే బీటెక్‌ కోర్సు పూర్తి చేసిన వారు ఎంటెక్‌ కోర్సుల్లో అడ్మిషన్లు పొందొచ్చు. ఇలా చేరిన వారికి సాయంత్రం వేళ తరగతులను నిర్వహించనున్నారు. ఈ

సాయంత్రం కోర్సులకు కూడా రెగ్యులర్‌ కోర్సులకు ఖరారు చేసిన ఫీజునే చెల్లించాల్సి ఉంటుంది.2024లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈసెట్‌ కన్వీనరే ఈ పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో

భాగంగానే రాష్ట్ర ఉన్నత విద్యామండలి కూడా ఈసెట్‌ కన్వీనర్, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఆచార్య చంద్రశేఖర్‌కు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం

ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. ఎంటెక్‌ సీట్ల భర్తీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేయగా.. అయితే వాటిని ఎలా భర్తీ చేస్తారు అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే 3, 4 కాలేజీల్లోనే సాయంత్రం

ఎంటెక్‌ కోర్సులకు అనుమతులు వచ్చాయి.
సాయంత్రం బీటెక్ కోర్సులకు అనుమతి పొందిన కాలేజీలు
చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)
వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి)
మాటూరి వెంకట సుబ్బారావు ఇంజినీరింగ్ కాలేజీ (ఎంవీఎస్‌ఆర్‌)
స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ (స్టాన్లీ)
మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (మెథడిస్ట్‌)
మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ)
మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజీ
అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలాజికల్ సైన్సెస్ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేపలగడ్డ)
జయప్రకాశ్‌ నారాయణ్‌ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (మహబూబ్‌నగర్‌)
అనుబోస్‌ ఇన్‌స్టిట్యూ్ట్ ఆఫ్ టెక్నాలజీ (ఖమ్మం జిల్లా పాల్వంచ)
సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం)
సెయింట్‌ పీటర్స్‌ ఇంజినీరింగ్ కాలేజీ (మేడ్చల్ జిల్లా)

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్