ఓయూ విద్యార్దులపై పోలీసుల యాక్షన్
అంబెద్కర్ విగ్రహానికి వినతిపత్రం
Petition for Ambedkar statue :
సిద్దిపేట
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నిరుద్యోగులపై జరుగుతున్న దాడికి నిరసనగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మెమొరండం సమర్పించి నిరసన తెలియజేయడం జరిగింది, ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మెరుగు మహేశ్, నియోజకవర్గ అధ్యక్షుడు నిమ్మ రజనీకాంత్ రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు పేర్క బాబు, సీనియర్ నాయకులు సామల్ల సాయి ప్రేమ్, మరియు గ్యాదరి సందీప్, సామల్లా గణేశ్, నాగరాజు లు కలసి మాట్లాడుతూ.
యూనివర్సిటీ లోకి వందల మంది పోలీస్ లు చొరబడి, ఒక్కో విద్యార్థి పైన రెండు డజన్ల మంది పోలీస్ లు మీద పడి కక్షకట్టినట్లు చితకబాదడం ఏందనీ ప్రశ్నిస్తూ,
వాళ్ళేమైనా తీవ్రవాదులా? లేక ఉగ్రవాదులా? లేక వాళ్ళేమైనా రాజద్రోహం చేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు యూనివర్సిటీ లోకి పోలీసులకు చొరబడే అధికారం ఎవరు ఇచ్చారు? ఇది చట్ట విరుద్ధం కాదా? పోలీస్ ల నీడలో విద్యార్థులు చదువుకోవాలా? అని నిలదీశారు,
ఉద్యోగాలు ఇవ్వమని అడిగినందుకు చితకబాదుతారా? అదే విద్యార్థులు తిరగబడితే మీరు, మీ పోలీస్లు తట్టుకోలేరనీ హెచ్చరించారు,
పవర్ ను చూసుకొని మేము పవర్ ఫుల్ అనుకుంటున్నారు. కానీ ఆ పవర్ ఇచ్చింది ఆ యువతనే. పవర్ ఫుల్ గా చేసిన వాళ్ళే నిన్ను పవర్ లెస్ గా కూడా చేయగలరు. గుర్తుపెట్టుకోండి హితువు పలికారు.
ఇకనైనా నిరుద్యోగుల పైన జరుగుతున్నటువంటి అణిచివేత ధోరణి మార్చుకోవాలి లేదంటే నిరుద్యోగులు గేరిల్లా ఉద్యమంల నిన్ను నీ కార్యాలయం ముట్టడించి రాజకీయ సమాధి చేస్తాం అని హెచ్చరిస్తున్నాం.



