- Advertisement -
గుంటూరు: గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ వద్ద పోలీసులు మోహరంచారు. శక్రవారం నాడు సంగం డెయిరీ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అనుమతి లేకుండా వెళ్లనీయబోమని డెయిరీ భద్రతా సిబ్బంది పోలీసులను నిలువరించారు. ఈనెల 15న జరిగిన ఘర్షణలో ధూళిపాళ్ల సహా మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదయిన విషయం తెలిసిందే. కేసు విచారణ కోసం డెయిరీకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
- Advertisement -



