Tuesday, January 14, 2025

కండోమ్ లో పెట్రోల్ పోసి….

- Advertisement -

కండోమ్ లో పెట్రోల్ పోసి….

Poured petrol on the condom.

ముంబై, డిసెంబర్ 28, (వాయిస్ టుడే)
రాజకీయ నాయకులపై, సినిమా వాళ్లపై… శత్రువులపై ఒక్కొక్కరూ ఒక్కోలా దాడి చేస్తారు. కర్రలు, రాళ్లతో కొట్డడం, గుడ్లు, టమోటాలు విసరడం.. మరీ కోపం ఎక్కువైతే కత్తులతో నరకడం, ఉరివేసి చంపడం, బాంబులు విసరడం ఇలా ఎన్నో రకాలుగా చేస్తుంటారు పలువురు నిందితులు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే దాడి మాత్రం అంతకు మించింది. ఓ గ్రామ సర్పంచ్‌పై పగ పట్టిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కండోమ్‌తో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సర్పంచ్ తీవ్రంగా గాయపడ్డాడు. కండోమ్ దాడి ఏంటబ్బా అనుకుంటున్నారా ఈ స్టోరీ మొత్తం చదివేయండి విషయం మీకే అర్థం అవుతుంది.మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లామేసాయి జవల్గా గ్రామ సర్పంచ్ అయిన నామ్‌డియో నికమ్ ప్రస్తుతం పుణేలో నివాసం ఉంటున్నాడు. కానీ పనుల నిమిత్తం గ్రామానికి మూడు నాలుగు సార్లు వచ్చి వెళ్తుంటాడు. ఈక్రమంలోనే డిసెంబర్ 26వ తేదీ రోజు కూడా గ్రామానికి వస్తున్నాడు. తనకు చెందిన ఎస్‌యూవీ వాహనంలో డ్రైవర్ సహా మరో అధికారిని వెంటబెట్టుకుని బయలు దేరాడు. రాత్రి 10 గంటల సమయంలో తుల్జాపూర్‌కు చేరగానే రెండు ద్విచక్రవాహనాలపై నలుగురు వ్యక్తులు వచ్చారు.కారును అడ్డగించి మరీ వారి వెంట తెచ్చుకున్న సుత్తెతో కారు విండో పగులగొట్టారు. ఆపై కారులోకి ఓ కండోమ్‌ను విసిరారు. అయితే అందులో అప్పటికే పెట్రోల్ నింపి ఉంది. ఆపై నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయారు నిందితులు. ఈ ఘటనలో సర్పంచ్ సహా మరో అధికారి గాయపడ్డారు. మళ్లీ వచ్చి వారేమైనా చేస్తారేమోనన్న భయంతో సర్పంచ్ వెంటనే స్థానిక పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సర్పంచ్ సహా మరో అధికారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అయితే సర్పంచ్ నామ్‌డియో నికమ్.. తమకు గ్రామంలోని ఎవరితోనూ శత్రుత్వం లేదని చెబుతున్నారు. మరి ఈ దాడికి పాల్పడింది ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఇదిలా ఉండగా డిసెంబర్ ప్రారంభంలో బీడ్ జిల్లాలో మాసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ను అపహరించి హత్య చేయడంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈకేసులో ప్రధాన సూత్రధారి రాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే సన్నిహితుడు వాల్కిక్ దాకర్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ గొడవ చల్లారక ముందే మరో సర్పంచ్‌పై దాడి జరగడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కూడా కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్