- Advertisement -
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం రేవంత్
హజరయిన భట్టి, ఇతర మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకున్నారు. శుకరవారం ఉదయం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ (ప్రగతి భవన్)లో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించార. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ప్రజాదర్బార్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే మీడియాతో రేవంత్ మాట్లాడుతూ… ప్రగతిభవన్ ను, సచివాలయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.


- Advertisement -