- Advertisement -
మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రజాకవి కాళోజి జయంతి వేడుకలు
Prajakavi Kaloji's birth anniversary was celebrated in the municipal office-నివాళులర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి
మంథని
తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వని, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి ని సోమవారం మంథని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్ర పటానికి మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాళోజీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ ఛైర్మెన్ శ్రీపతి బానయ్య,మున్సిపల్ కమీషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్ వేముల లక్ష్మి -సమ్మయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -




