రైలు ప్రమాదం పై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి

విజయనగరం జిల్లాల్లో రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని ప్రధాని మోదీ సమీక్షించారు. బాధితులకు అధికారులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ప్రధాని, మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. క్షత గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు.