Tuesday, March 24, 2026

తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ…

- Advertisement -

తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ…
హైదరాబాద్, మార్చి 24, (వాయిస్ టుడే )

Prime Minister Narendra Modi to Telangana…
ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా నగరంలో నిర్వహించే ఒక భారీ బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుడతారని సమాచారం. లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి కావడంతో, ఈ పర్యటనపై రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 8 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటిందిఈ పర్యటనలో భాగంగా వరంగల్‌లోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీబీనగర్ ఎయిమ్స్ లో కొత్తగా నిర్మించిన పలు బ్లాకులు, అలాగే పూర్తయిన జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభించనున్నారు. వీటితో పాటు, హైదరాబాద్ నుండి యాదాద్రి వరకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్  రెండో దశ రైల్వే ప్రాజెక్టుకు, ప్రాంతీయ వలయ రహదారి  ఉత్తర భాగానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని భావిస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై పార్టీ పరంగా సమాచారం రావడంతో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో శనివారం జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఈ విషయంపై ప్రాథమికంగా చర్చించారు. ప్రధాని మోదీ అధికారిక పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, కార్యక్రమాల టైమింగ్స్‌పై కేంద్ర ప్రభుత్వం నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ కీలక సమయంలో ప్రధాని మోదీ రాష్ట్రానికి రానుండటంతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్