జిల్లా అభివృద్దికి నిధులివ్వండి

- Advertisement -

జిల్లా అభివృద్దికి నిధులివ్వండి

Provide funds for district development

కంపెనీ ప్రతినిధులతో మంత్రి   దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా లో ఉన్న అతి పెద్ద, పెద్ద & మధ్య స్థాయి కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం లో జిల్లా క్రాంతి వల్లూరురితో కలిసి పాల్గోన్నారు.  సంగారెడ్డి జిల్లా లో సామాజిక, విద్యా , వైద్య రంగాల అభివృద్ధికి సీఎస్సార్   ఫండ్స్ కేటాయింపుల పై చర్చ జరిపారు. జిల్లాలో ఉన్న కంపెనీ లు జిల్లా అభివృద్ధికి సీఎస్సార్   ఫండ్స్ ను తమవంతు భాధ్యత గా జిల్లా అభివృద్ది కి 2 శాతం   ఫండ్స్ ను విడుదల చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ కంపెనీ  ప్రతినిధులకు, యాజమాన్యాలకు సూచించారు.  గతంలో సీఎస్సార్R ఫండ్స్ తో చేపట్టిన పనులను వెంటనే పూర్తి అయ్యేలా కంపెనీ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు.  ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular