Sunday, September 8, 2024

రాజకీయాలకతీతంగా ప్రజాసేవ చేస్తా

- Advertisement -

రాజకీయాలకతీతంగా ప్రజాసేవ చేస్తా

– సీపీఎం, (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యాలయాల సందర్శనలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
–  సాయిబాబా ఆలయంలో  పూజలు, కరుణగిరి చర్చిలో ప్రార్థనలు
ఖమ్మం:
రాజకీయ పార్టీలకతీతంగా ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని, అందరివాడిగా ఉండి తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఉదయం ఆయన నగరంలోని వీడీవోస్ కాలనీలో సాయిబాబా దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం కరుణగిరిలోని ఫోర్త్ ఎంప్లాయీస్ చర్చిని సందర్శించి అక్కడ ప్రార్ధన చేశారు. ఆ తర్వాత సీపీఎం, సీపీఐ(మాస్ లైన్) ప్రజాపంథా జిల్లా కార్యాలయాలకు వెళ్లి ఎన్నికలప్పుడు తనకు మద్దతునిచ్చి భారీ విజయానికి సహకరించినందుకు ఆ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా  ఆయా పార్టీల నాయకులు ఎంపీ కి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ..తన గెలుపును.. అందరి విజయంగా భావిస్తానని కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రజాస్వామ్య పరిరక్షణకు తనవంతుగా లోక్ సభలో గళం విప్పుతానని అన్నారు. లోక్ సభ లో ప్రతిపక్ష హోదాలో ఉన్న తాము రాహుల్ గాంధీ నేతృత్వంలో ముందుకు సాగుతామని తెలిపారు. ఓ ఎంపీగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా నేరుగా కలిసి విన్నవించొచ్చని అభయం ఇచ్చారు.
సీపీఐ(ఎం ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ..
నిరంకుశ బీజేపీని నిలువరించేందుకు ఇండియా కూటమికి మద్దతు ఇచ్చామని, భవిష్యత్తులోనూ ప్రజా వ్యతిరేక పోరాటాలలో కలిసి వస్తామని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్, రైతాంగ సమస్యలను ఈ సందర్భంగా ఎంపీ దృష్టికి తీసుకురాగా.. జిల్లా మంత్రులతో సంప్రదించి త్వరితగతిని పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో.. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు కొప్పుల చంద్రశేఖర్ రావు, మిక్కిలినేని నరేందర్, సీపీఎం నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, సుబ్బారావు, కళ్యాణo వెంకటేశ్వరరావు, బషీరుద్దీన్, డాక్టర్ భారవి, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెoకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ , గుర్రo అచ్చయ, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్, బందెల వెంకయ్య, సీవై.పుల్లయ్య,  శివలింగం,  కమ్మ కోటి నాగేశ్వరరావు, పుసులూరి నరేందర్ ఝాన్సీ, ఆజాద్, కే.శ్రీను తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్