- Advertisement -
పివీని దేశం మరచిపోదు
PV will not be forgotten by the nationటీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్
భారత రత్న మాజీ ప్రధాని పీవి నరసింహరావు 20 వ వర్ధంతి సందర్భంగా పీవీ జ్ఞానభూమి వద్ద టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. మహేష్ కుమార్ మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల పితామహుడు , అపర చాణక్యుడు, బహుభాషా వేత్త పీవీ నరసింహా రావు. కాంగ్రెస్ పార్టీ ఆస్తి పీవీ నరసింహారావు. గొప్ప సంస్కరణశీలి, మేధావి పీవీ నరసింహారావు చరిత్రను దేశం ఎన్నటికీ మర్చిపోదు. దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి.. దివాలా అంచున ఉన్న ఆర్థిక వ్యవస్థను కాపాడిన గొప్ప ఆర్థిక వేత్త పీవీ అని కొనియాడారు.
- Advertisement -




