హెచ్సీయూ భూములు
ప్రభుత్వ తీరును తప్పు పట్టిన ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్
కంచె గచ్చిబౌలి భూమి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. గతంలో కాం గ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రేవేట్ వ్యక్తులకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్ , అల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ , ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. 400 ఎకరాల భూమి వేలం అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే యూనివర్సిటీని బుల్డోజర్లతో యుద్దవాతావరణం నెలకొల్పారన్నారు. ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయని… కానీ జీవవైవిధ్యాన్ని నాశనం చేసేలా ప్రకృతిని ధ్వంసం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్ లను పరిగణలోకి తీసుకుని , ఆ భూమిని యూనివర్సిటీ కు అప్పగించాలని ఆర్ కృష్ణయ్య కోరారు.
ప్రభుత్వ తీరును తప్పు పట్టిన ఆర్ కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -