Sunday, September 8, 2024

మళ్లీ కాంగ్రెస్ గూటికి రాములమ్మ

- Advertisement -

హైదరాబాద్, నవంబర్  17, (వాయిస్ టుడే):  భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఒక్క రోజునే మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన మల్లిఖార్జున్ ఖర్గేను ఆయన బస చేసిన హోటల్ లో విజయశాంతి కలిశారు. అక్కడే పార్టీలో చేరిపోయారు. ఆమె రాహుల్ సమక్షంలో పార్టీలో చేరుతారని అనుకున్నారు. కానీ అధికారికంగా పార్టీ అధ్యక్షుడి సమక్షంలో చేరాలి కాబట్టి ఖర్గే తో కండువా కప్పించుకన్నారు. తర్వాత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి విజయశాంతి బీజేపీలోకి వెళ్లారు. కానీ కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా విజయశాంతి బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనలేదు. బుధవారం ఈమె బీజేపీకి రాజీనామా చేశారు. ఇవాళ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదట బీజేపీ నుంచే తన రాజకీయ జీవితం ప్రారంభించారు. తర్వాత తల్లి తెలంగాణ అనే సొంత పార్టీ పెట్టుకున్నారు.

Ramulamma again in the Congress
Ramulamma again in the Congress

కేసీఆర్ ఆహ్వానించడంతో బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ తరపున మెదక్ నుంచి ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన కాంగ్రెస్ చేయడంతో 2014లో కాంగ్రెస్ లో చేరారు. ఆమెకు కాంగ్రెస్ తరపున మెదక్ అసెంబ్లీ టిక్కెట్ కేటాయించారు. కానీ అక్కడ గెలవలేదు. అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరం అయ్యారు. మళ్లీ 2019లో బీజేపీలో చేరారు. కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. బీజేపీలో ప్రాధాన్యం దక్కకపోవడమే కాకుండా.. ఆ పార్టీ బీఆర్ఎస్ పై పోరాడటం లేదని.. బీఆర్ఎస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్న అభిప్రాయంతో ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో చాలా మంది ఇలా బీజేపీలో చేరిన నేతలు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.  మెదక్ ఎంపీ సీటు ఇవ్వడంతో పాటు పార్టీలోనూ ప్రాధాన్యం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో మళ్లీ ఆ పార్టీలో చేరిపోయినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున ఆమె ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్