Sunday, September 8, 2024

స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో రాములమ్మ

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 8, (వాయిస్ టుడే): బీజేపీ మహిళా నేత విజయశాంతి కమలం పార్టీలో  కొనసాగాలా లేకుంటే కండువా మార్చేయాలా..? అని ఆలోచిస్తున్నారా? …. ఎన్నికల ముందు రాములమ్మ కీలక నిర్ణయం తీసుకోనున్నారా … అంటే ఔననే సమాధానం వస్తోంది … గత కొంత కాలంగా బీజేపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. బీజేపీ తీరుతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారంట …. దానికి తగ్గట్లే బీజేపీ తీరుని వ్యతిరేకిస్తున్నట్లు ఆమె ట్వీట్లు చేస్తుండటం  ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది … ఆ క్రమంలో రాములమ్మకు హైకమాండ్ ప్రకటించిన బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ జాబీతాలో చోటు దక్కలేదు ..  దాంతో ఆమె పార్టీ ఖాయమన్న ప్రచారంతో రాష్ట్ర నాయకత్వం కంటితుడుపు చర్యకు ఉపక్రమించింది.. మరి దీంతో ఆమె శాంతిస్తారా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ విజయశాంతికి తన సొంత పార్టీ బీజేపీలో అవమానాలు ఎదురవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి … తెలంగాణ కోసం సొంత పార్టీ మరీ పెట్టుకుని పోరాడిన మహిళా నాయకురాలిగా.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రాములమ్మ ఇప్పుడు రాజకీయ అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి… దీంతో ఆమె వరుసగా అవమానాలకు గురవుతున్నారని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు …. ఈ క్రమంలో బీజేపీ నుంచి మరోసారి ఆమెకు అవమానం జరిగింది… ఢిల్లీ పెద్దలు ప్రకటించిన బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో  విజయశాంతి పేరు కనిపించలేదు .. దాంతో ఆమె పార్టీ మార్పుపై డెసిషన్ తీసుకుంటారన్న ప్రచారంతో .. రాష్ట్ర బీజేపీ నేతలు కవర్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు .. కంటితుడుపు చర్యకు ఉపక్రమించారు!
విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు అవుతోంది .. బీజేపీలో చేరి మూడేళ్లు కావొస్తోంది … అయితే.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒకే ఒక్కసారి మాత్రమే ఎంపీగా సేవలందించే అవకాశం ఆమెకు  దక్కింది.. అది కూడా టీఆర్ఎస్ చలవే.. అప్పట్లో కారు గుర్తుతో ఆమె మెదక్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు .. ఇక ఆ తర్వాత 2014లో మెదక్ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు… మరి ఈసారైనా బీజేపీ నుంచి అవకాశం దక్కుతుందా అనుకుంటే.. అది కూడా ఎండమావిలాగే కనిపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
బీజేపీ పెద్దలు తెలంగాణ ఎన్నికలకోసం ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించగా.. ఎందులోనూ ఆమె పేరు కనిపించలేదు …. ఇక జనసేనతో పొత్తుతో ఆ పార్టీనేతలకూ 8 స్థానాలు కేటాయించారు .ఇక కాషాయ పార్టీ ప్రకటించాల్సినవి 23 స్థానాల అభ్యర్ధులనే.. మిగిలిన ఆస్థానాల్లో అయినా ఆమెపేరు ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఇలాంటి తరుణంలో బీజేపీ తెలంగాణ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఊహించని విధంగా ఆమె పేరు మాయమైంది.
తెలంగాణ ఎన్నికల్లో స్టార్ క్యాంపెనిర్ల జాబితాలో ఆమెతో పాటు.. తెలంగాణ బీజేపీలో లాజికల్ గా, పిన్ టు పిన్ మాట్లాడగల వక్తగా పేరున్న రఘునందన్ రావు పేరు కూడా లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.. దీంతో  తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒకడుగు ముందుకి.. నాలుగడుగులు వెనక్కి అన్నట్లు తయారువావడానికి కారణం…  ఇలాంటి నిర్ణయాలే అనే టాక్ మొదలైంది… విజయశాంతి వాక్ చతుర్యం.. రఘునందన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ బీజేపీకి అవసరం లేదా.. ఇప్పుడున్నవారంతా అంతకు మించిన వక్తలా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.
దీంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది .. దీంతో స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో మార్పులు చేసి ఆఖరికి విజయశాంతి, రఘునందన్ రావు పేర్లను చేర్చి మ‌రో ప్రకటన విడుదల చేశారు … ఆ క్రమంలో మొత్తం 42 మంది నేతలు తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు … వీరిలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌ నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నారు. ఇక రాష్ట్ర నేతల జాబితాలో… కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రాజా సింగ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఎంపీ అరవింద్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి వారు కూడా ఉన్నారు. అయితే వీరందరి పేర్లు తొలిజాబితాలో ఉన్నప్పటికీ… విజయశాంతి, రఘునందన్ ల పేర్లు లేవు. దీంతో… ఉద్దేశపూర్వకంగానే విజయశాంతిని పక్కనపెట్టారని ప్రచారం జరిగింది… ఇప్పుడు ఆ ఇద్దరి పేర్లు కూడా లిస్టులో చేర్చారు కమలనాథులు…
ఫస్ట్ లిస్టులో పేరు లేకుండా తర్వాత కంటితుడుపుగా తన పేరు జాబితాలో చేర్చడంతో రాములమ్మ బీజేపీ ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అనేది ప్రశ్నార్ధకంగా తయారైంది.. ఇప్పటికే ఆమెకు కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చిందని.. లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ టికెట్ ఖాయం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి… ఇటు చూస్తే రాములమ్మ కూడా బీజేపీ కార్యక్రమాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు.. ఆ క్రమంలో ఆమె పార్టీ మారడానికే డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారంటున్నారు.. తెలంగాణ బీజేపీకి ఉన్న ఏకైక సినీ గ్లామర్ విజయశాంతి.. మరి ఆమె కాల్షీష్ట్ లు ఏ పార్టీకి దక్కుతాయో చూడాలి…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్