- Advertisement -
తిరుపతి :అక్టోబర్ 30: తిరుమల లో భక్తుల రద్దీ సర్వ సాదారణంగా ఉంది. సోమవారం శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు నాలుగు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్వనానికి 3 గంటల సమయం పడుతోందని తెలిపారు.
కాగా,నిన్న ఆదివారం 85,497 శ్రీవారిని మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 24, 873 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.41కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు…..
- Advertisement -


