Friday, February 20, 2026

 రేవంత్ వన్ మ్యాన్ షో….

- Advertisement -

 రేవంత్ వన్ మ్యాన్ షో
Revanth One Man Show
హైదరాబాద్,, ఫిబ్రవరి 19, (వాయిస్ టుడే )
తెలంగాణలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికలు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒక యాసిడ్ టెస్ట్‌గా నిలిచాయి. ప్రభుత్వ వ్యతిరేకత పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టి..  రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80

శాతానికి పైగా మున్సిపాలిటీలు,  కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహ చతురతకు నిదర్శనంగా మారింది. ముఖ్యంగా పట్టణ ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం, గతంలో

కేవలం గ్రామీణ పార్టీగా ఉన్న ముద్రను రేవంత్ చెరిపివేయగలిగారు. ఈ విజయంతో ఆయన హైకమాండ్ వద్ద తన పరపతిని అమాంతం పెంచుకున్నారు.ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన  నేనే రాజు.. నేనే మంత్రి వ్యాఖ్యలు

రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే, దీనిపై ఆయన తర్వాతి కాలంలో స్పష్టత ఇచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు, మున్సిపల్ పరిపాలన శాఖను కూడా తానే పర్యవేక్షిస్తున్నందున, ఈ

ఎన్నికల గెలుపోటములకు తానే పూర్తి బాధ్యత  వహిస్తాననే ఉద్దేశంతో ఆ మాట అన్నట్లు వివరించారు. ఒక సేవకుడిగానే తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెబుతూనే, బాధ్యతను భుజానికెత్తుకునే విషయంలో

తనకున్న తెగింపును ఈ వ్యాఖ్యల ద్వారా చాటారు. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే  గ్రూపు రాజకీయాలు రేవంత్ రెడ్డి విషయంలో ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. పార్టీలో ఆలస్యంగా చేరినప్పటికీ,

సీనియర్లను సమన్వయం చేసుకుంటూనే, తన నిర్ణయాలే ఫైనల్ అనే స్థాయికి ఆయన ఎదిగారు. గతంలో బహిరంగంగా విమర్శలు చేసిన నాయకులు కూడా ఇప్పుడు మౌనం వహించడం. రేవంత్ నాయకత్వాన్ని

సమర్థించడం ఆయన సాధించిన అతిపెద్ద రాజకీయ విజయం. హైకమాండ్ పూర్తి మద్దతు ఉండటంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో రేవంత్ ఇప్పుడు  ఒక్కడే మొనగాడు గా కనిపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యతిరేక కామెంట్లు

చేస్తున్నా ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ  నెక్స్ట్ జనరేషన్ లీడర్‌గా గుర్తింపు

పొందుతున్నారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడమే కాకుండా, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా మారుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక

గాంధీల నమ్మకాన్ని చూరగొనడంలో ఆయన సఫలీకృతులయ్యారు.వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ  ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడంతో తెలంగాణలో రేవంత్ రెడ్డికి

ఎదురులేకుండా పోయింది. అటు విపక్ష బీఆర్ఎస్ బలహీనపడటం, ఇటు బీజేపీ పట్టణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడం రేవంత్‌కు కలిసొచ్చింది. తన సంక్షేమ పథకాలు, దూకుడుగా ఉండే రాజకీయ

శైలితో రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయ యవనికపై ఒక బలమైన ముద్ర వేశారు. ఇది రేవంత్ నాయకత్వ పరంగా పంజుకోవడానికి కలసి వచ్చింది.          )
తెలంగాణలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికలు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒక యాసిడ్ టెస్ట్‌గా నిలిచాయి. ప్రభుత్వ వ్యతిరేకత పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టి..  రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80

శాతానికి పైగా మున్సిపాలిటీలు,  కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహ చతురతకు నిదర్శనంగా మారింది. ముఖ్యంగా పట్టణ ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం, గతంలో

కేవలం గ్రామీణ పార్టీగా ఉన్న ముద్రను రేవంత్ చెరిపివేయగలిగారు. ఈ విజయంతో ఆయన హైకమాండ్ వద్ద తన పరపతిని అమాంతం పెంచుకున్నారు.ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన  నేనే రాజు.. నేనే మంత్రి వ్యాఖ్యలు

రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే, దీనిపై ఆయన తర్వాతి కాలంలో స్పష్టత ఇచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు, మున్సిపల్ పరిపాలన శాఖను కూడా తానే పర్యవేక్షిస్తున్నందున, ఈ

ఎన్నికల గెలుపోటములకు తానే పూర్తి బాధ్యత  వహిస్తాననే ఉద్దేశంతో ఆ మాట అన్నట్లు వివరించారు. ఒక సేవకుడిగానే తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెబుతూనే, బాధ్యతను భుజానికెత్తుకునే విషయంలో

తనకున్న తెగింపును ఈ వ్యాఖ్యల ద్వారా చాటారు. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే  గ్రూపు రాజకీయాలు రేవంత్ రెడ్డి విషయంలో ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. పార్టీలో ఆలస్యంగా చేరినప్పటికీ,

సీనియర్లను సమన్వయం చేసుకుంటూనే, తన నిర్ణయాలే ఫైనల్ అనే స్థాయికి ఆయన ఎదిగారు. గతంలో బహిరంగంగా విమర్శలు చేసిన నాయకులు కూడా ఇప్పుడు మౌనం వహించడం. రేవంత్ నాయకత్వాన్ని

సమర్థించడం ఆయన సాధించిన అతిపెద్ద రాజకీయ విజయం. హైకమాండ్ పూర్తి మద్దతు ఉండటంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో రేవంత్ ఇప్పుడు  ఒక్కడే మొనగాడు గా కనిపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యతిరేక కామెంట్లు

చేస్తున్నా ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ  నెక్స్ట్ జనరేషన్ లీడర్‌గా గుర్తింపు

పొందుతున్నారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడమే కాకుండా, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా మారుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక

గాంధీల నమ్మకాన్ని చూరగొనడంలో ఆయన సఫలీకృతులయ్యారు.వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ  ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడంతో తెలంగాణలో రేవంత్ రెడ్డికి

ఎదురులేకుండా పోయింది. అటు విపక్ష బీఆర్ఎస్ బలహీనపడటం, ఇటు బీజేపీ పట్టణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడం రేవంత్‌కు కలిసొచ్చింది. తన సంక్షేమ పథకాలు, దూకుడుగా ఉండే రాజకీయ

శైలితో రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయ యవనికపై ఒక బలమైన ముద్ర వేశారు. ఇది రేవంత్ నాయకత్వ పరంగా పంజుకోవడానికి కలసి వచ్చింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్