- Advertisement -
పేదల భూములను కొలగొడుతున్న రేవంత్ రెడ్డి
Revanth Reddy who is acquiring the lands of the poor
లగచర్ల రైతులను పరామర్శించిన కేటీఆర్
సంగారెడ్డి
కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు శుక్రవారం నాడు లగచర్ల బాధిత రైతులను సంగారెడ్డి జైల్లో ములాఖత్ అయి పరామర్శించారు. తరువాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధితులను కలవటం జరిగింది. లగచర్ల లో పేదల భూమి సేకరించే విషయంలో వాళ్లను సమిధలు చేస్తున్నారు. లక్షల రూపాయల విలువ చేసే భూములను అడ్డికి పావు శేరు ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లగచర్ల సహా భూమి కోల్పోతున్న రైతులు తీవ్రంగా రోదిస్తున్నారని అన్నారు.
కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడు. గతంలో ఫార్మా అంటే కాలుష్యం అన్న రేవంత్ రెడ్డి యే ఇప్పుడు ఏ విధంగా 3 వేల ఎకరాలు తీసుకుంటున్నాడు. జైల్లో ఇప్పుడు మేము 16 మందిని కలిశాం. వాళ్ల బాధ చెప్పలేని విధంగా ఉంది. అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. రేవంత్ రెడ్డి పెట్టిన కులగణన కార్యక్రమంలో ఉన్న ఉద్యోగిని సాయంత్రం దాడిలో పాల్గొన్నాడంటూ తీసుకెళ్లారు. ఇంకొక తమ్ముడు వనపర్తి లో చదువుకుంటున్నాడు. గొడవ జరిగిన విషయం తెలిసి ఇంటికి వస్తే ఆయనను కూడా జైలుకు తీసుకొచ్చారు. సంఘటనతో సంబంధం లేని వాళ్లను జైల్లో పెట్టారు. ముందు 60, 70 మందిని అరెస్ట్ చేశారు. దాడి చేసిన వాళ్లలో కాంగ్రెస్ నాయకులే ప్రధానంగా ఉన్నారు. దుద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడి అనుచురులు దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. కానీ పోలీసులకు మాత్రం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఫోన్ లో డైరెక్షన్స్ ఇచ్చి వీళ్లను కొట్టించాడని ఆరోపించారు.
ముఖ్యమంత్రి సోదరుడున్న ఒకే ఒక్క అర్హతతో తిరుపతి రెడ్డి కొడంగల్ లో రాజ్యంగేతర శక్తి గా మారాడు. కలెక్టర్ సహా పోలీసులు, అధికారులు ఆయన ముందు మోకరిల్లే విధంగా రారాజుగా వ్యవహరిస్తున్నాడు. కొడంగల్ లో ముఖ్యమంత్రిది ఏమీ నడవదంట. అంతా తిరుపతి రెడ్డిదే చెల్లుతదని చెబుతున్నారు. నిజానికి దాడి చేసిన వారిలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారు. భూములు పోతాయని వాళ్లే దాడి చేశారు. కానీ అరెస్ట్ చేసిన 70 మందిలో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్లు గుర్తించి 21 మందిని మాత్రమే చిత్ర హింసలు పెట్టి కేసులు పెట్టారు. మిగతా కాంగ్రెస్ వాళ్లను వదిలేశారు. కానీ దాడి జరిగిన వీడియోల్లో కాంగ్రెస్ వాళ్లు కనబడుతున్నారు. ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్లు మాత్రమే చేశారని చెప్పాలని కుట్ర చేస్తున్నారు. వాళ్ల చేతగాని తనాన్ని, అధికారులకు, ప్రభుత్వానికి జరిగిన పరాభవానికి ఏం చెప్పాలో తెలియక దీనికి రాజకీయ రంగు పులిమారని విమర్శించారు. 21 మంది రైతులు అంతా కూడా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే. వికారాబాద్ ఎస్పీ, సీఐలు, ఎస్ లు చిత్ర వారిని చిత్ర హింసలు పెట్టారు. మూడు మూడు గంటల పాటు కొట్టారు. మెజిస్ట్రేట్ ముందు కొట్టారని చెబితే మళ్లీ కొడతామని అమానవీయంగా వ్యవహరించారని వాళ్లు మాకు చెప్పారు. తీవ్రవాదులను పట్టుకొనేందుకు వెళ్లినట్లు డోర్లను తంతు పోలీసులు ఊర్లో భయానక వాతావారణ సృష్టించారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్లు తాగి బూతులు మాట్లాడుతూ ప్రజలపై దాడులు కూడా చేశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మీరుండేది ఐదేళ్లు మాత్రమే. అధికారం శాశ్వతమని భావించకండి. నువ్వు చక్రవర్తి వి కాదు. నీలాంటి చాలా మంది చూశాం. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే నీ పదవి ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల భూములు గుంజుకుంటా అంటే మేము ఊరుకోం. రేవంత్ రెడ్డి పై ఇవ్వాళ కొడంగల్ మర్లవడ్డది. రేపు తెలంగాణ మొత్తం మర్లవడుతది. కావాలంటే మమ్మల్ని జైల్లో పెడితే పెట్టు. మేము అధికారంలో వచ్చాక నిన్ను ఏం చేయాలో అది చేస్తామని అన్నారు.
కానీ రైతులను వదిలేయ్. నువ్వు అరెస్ట్ చేయించిన 21 మంది రైతుల కుటుంబాల ఉసురు నీకు, నీ పార్టీకి తాకుతది. ఏ పేద ప్రజల ఓట్లతో గెలిచావో ఆ పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న నీకు వాళ్ల ఉసురు తప్పకుండా తగులుతుంది. 21 మంది రైతులు బయటకు వచ్చే వరకు బీఆర్ఎస్ వారికి న్యాయసాయంతో పాటు అండగా ఉంటుంది. రాఘవేంద్ర అనే ఉద్యోగి తన ఉద్యోగం కోసం భయపడుతున్నాడు. ఆయన ఉద్యోగం పోకుండా అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాం. మిగతా బాధిత రైతులకు కూడా చెబుతున్నా మీరు భయపడకండి. ఇంతకంటే మిమ్మల్ని వాళ్లు ఏం చేసేది లేదు. ఉరి శిక్ష వేయరు. ధైర్యంగా ఉండండి. తన చేతగానీ వైఫల్యాలను తప్పించుకోవటానికే రేవంత్ రెడ్డి ఈ డ్రామాలు చేస్తున్నాడు. 60, 70 లక్షలు విలువ చేసే భూమికి 10 లక్షలు ఇస్తా అంటే రైతులు ఒప్పుకుంటారా? సంగారెడ్డి న్యాల్ కల్ వద్ద కూడా భూసేకరణ విషయంలో దాడి జరిగింది. కేసీఆర్ ఫార్మాసిటి కోసం హైదరాబాద్ లో 14 వేల ఎకరాలు సేకరిస్తే దాన్ని వద్దని ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని అన్నారు.
- Advertisement -