డీజీపీకి ఆర్జీవీ పిర్యాదు
విజయవాడ
నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని కలిసారు. అయనకు పిర్యాదు అందించారు. ఆర్జీవీ మాట్లాడుతూ టీవీ5లో కొలికపూడి నాతల తెస్తే రూ. కోటి ఇస్తానన్నారు.
నన్ను చంపటానికి టీవీ లైవ్ లో డైరెక్ట్ గా ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. యాంకర్ సాంబశివ రావు వద్దన్నా కొలికపూడి అదేమాట మూడుసార్లు అన్నారు. సాంబశివరావు, కొలికపూడి ముందే కుమ్మక్కై ఇలా
మాట్లాడారని అన్నారు. అతని వ్యాఖ్యల వల్ల వేరేవాళ్లు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. ఆటీవీ చానెల్ లో వచ్చింది కాబట్టి ఛానల్ ఎండీకి ఈ కుట్రలో భాగస్వామ్యం ఉంది. కొలికపూడి, టీవీ5 ఎండీ బీర్
నాయుడు, సాంబశివరావులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశాను. కొలికపూడి ఈ వ్యాఖ్యలు చేసి 24గంటలు గడిచినా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఖండించలేదు.
లోకేష్, బాబు జగన్ పై ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు. సినిమా అనేది విమర్శ కాదు. వ్యూహం సినిమాకు తెలుగుదేశం భయపడుతుంది. వ్యూహం సినిమాతో టీడీపి నేతలు గుమ్మడి కాయల దొంగ
అంటే బుజాలు తడుముకుంటున్నరని అన్నారు.



