- Advertisement -
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం
Road accident in Annamaiya districtఅన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును రామాపురం మండలం మేదరపల్లి చెక్ పోస్టు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. జేసీబీ సాయంతో బస్సును, లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -




