- Advertisement -
రుధీర నివాళి అర్పించిన చిత్ర కళాకారుడు
Rudheera is a tribute film artist
నంద్యాల
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్ర కళాకారుడు చింతల పల్లి కోటేష్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తన రక్తంతో ఏ3 డ్రాయింగ్ షీట్ పై 240 మంది సమరయోధుల పొట్రాయిట్ చిత్రాలను ఐదు గంటల సమయంలో వేసి సమర యోధులకు చిత్రాన్ని వాళ్లు అర్పించారు. ఎందరో వీరుల త్యాగ ఫలమే నేటి స్వతంత్ర ఫలమని,దేశం కోసం బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడి అమరులైన వీరులు,వీరమాతలు ఎందరో ఉన్నారన్నారు. ఈ చిత్రంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోరాట యోధులను భరతమాత చూస్తున్నట్లు చిత్రం వేశానని అన్నారు. ఈ చిత్రం సమరయోధులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -




