అమరావతి ఓఆర్ఆర్ అనుసంధానాలపై సర్కార్ ఆదేశాలు
Sarkar orders on Amaravati ORR connections
విజయవాడ
అమరావతి అవుటర్ రింగ్రోడ్డు (ఓఆర్ ఆర్) అలైన్మెంట్ జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే చోట గందరగోళం లేకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థకు నిర్దేశించింది. ఈ ప్రాజెక్టు మొత్తం 7
జాతీయ రహదారులతో అనుసంధానమవుతుంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలతో అమరావతి రాజధానికి రోడ్డు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ అలైన్మెంట్ మలుపులు లేకుండా ఉండేలా చూడటంతో పాటు
ఆయా జాతీయ రహదారులు అనుసంధానమయ్యే చోట ఇబ్బందులు లేకుండా, ఎలాంటి గందరగోళం లేకుండా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. నేరుగా అనుసంధానం అయ్యే చోట ఈ జాగ్రత్తలు బాగా తీసుకోవాలని
పేర్కొంది. అలాగే, ట్రంపెట్ ఇంటర్ చేంజ్ల విషయంలో కూడా ఎలాంటి గందరగోళం, సమస్యలకు అవకాశం లేకుండా అనుసంధానమయ్యేలా చర్యలు చేపట్టాల్సిందిగా తెలిపింది. దీంతో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుతో
అనుసంధానమయ్యే మచిలీపట్నం-హైదరాబాద్ (ఎన్హెచ్-65), కొండమోడు-పేరేచర్ల (ఎన్హెచ్-163ఈజీ), చెన్నై-కోల్కతా (ఎన్హెచ్-16), విజయవాడ-ఖమ్మం-నాగపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే (ఎన్హెచ్-163జీ),
గుంటూరు-అనంతపురం (ఎన్హెచ్-544డీ), ఇబ్రహీంపట్నం-జగదల్పూర్ (ఎన్హెచ్-30) వంటి వాటి విషయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నారు.