ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముద్రగడ లేఖ
విజయవాడ
Sealed letter to Chief Minister Chandrababu Naidu
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసారు. మీ పాలనలో ఎప్పుడూ కాపులను టార్గెట్ చేస్తున్నారు. అప్పుడు నా కుటుంబాన్ని ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన దహనకాండ కొనసాగుతుందని అన్నారు.
ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తున్నారు. దీనికన్నా రాష్ట్రంలో ఎమర్జెనీ ప్రకటించండి. మీ పదవీకాలం బలమైన ప్రతిపక్షాన్ని జైలులో పెట్టడానికి వీలుపడుతుంది. గతంలో మీరు బిసి రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశారు. కాపులు మీ మీద కోపంగా ఉన్నా డిప్యూటీ సీఎం పవన్ వల్ల మీరు అధికారంలోకి వచ్చిన విషయం నిజం కదా. ఐనా మీరు ఈ కులం మీద రాగిపోతూనే ఉన్నారు. దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుండి కట్టుబట్టలతో వేరే రాష్ట్రాలకు పంపించండని లేఖలో పేర్కోన్నారు.



