Sunday, September 8, 2024

బలమైన అభ్యర్ధుల కోసం అన్వేషణ

- Advertisement -

బలమైన అభ్యర్ధుల కోసం అన్వేషణ
హైదరాబాద్, మార్చి 6,
లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్‌లో కింది స్థాయి నేతల నుంచి ఎంపీ టిక్కెట్ పొందగలిగే స్థాయి నేతల వరకూ  రాత్రికి రాత్రే జంప్ చేస్తున్నారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన సీనియర్ నేతల్లో చాలామంది ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోగా, కాంగ్రెస్‌లో టికెట్ రాదనుకున్న మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాంగ్రెస్,  బీజేపీ అభ్యర్థుల కసరత్తును దాదాపుగా పూర్తి చేశాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం.. ఒక వేళ టిక్కెట్ ఇస్తే ఉంటారా .. వెళ్లిపోతారా అన్న సందిగ్ధంలో పడింది. ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ పరిమామాలు బీఆర్ఎస్ పార్టీని కలవర పెడుతున్నాయి. నిన్నటి దాకా తన దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు వేరే పార్టీలో చేరిపోవటం, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దిక్కులు చూడటంతో కేసీఆర్‌ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో హైదరబాద్ పరిధిలోని దాదాపు అన్ని సీట్లు గెలుచుకుని ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఆ పార్టీకి నేడు లోక్‌సభ అభ్యర్థులు కరువవయ్యారు. అధికారంలో ఉండగా అన్నీ తానై వ్యవహరించిన కుమారుడు కేటీఆర్.. విపక్షంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పార్టీని కాపాడుకోలేకపోవటం, హరీష్ రావు సైతం కేవలం తన జిల్లా రాజకీయాలకే పరిమితం కావటంతో కేసీఆర్ మళ్లీ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. లోక్‌సభ సీట్ల విషయానికొస్తే.. ఎంపీగా పోటీచేయాలంటే వంద కోట్లైనా ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి ఉంది. దీంతో దీనికోసం పోటీపడే వ్యాపారవేత్తలు, సంపన్నులు తమ ప్రయోజనాలు నెరవేరాలని కోరుకోవటం సహజమే. అయితే.. పార్టీ ఓటమితో పాత నేతలెవరూ ఇప్పుడు ఎంపీ సీటు మాకొద్దంటే మాకొద్దని దూరంగా ఉంటున్నారు. గతంలో కేసీఆర్‌తో రాసుకుపూసుకు తిరిగి, పోటీకి ఉవ్విళ్లూరిన కొందరు సంపన్నులు సైతం మొహం చాటేయటం ఆ పార్టీని కలవరపరుస్తోంది.రాష్ట్రంలో అధికారం పోయిన సిట్టింగ్ సీట్లను నిలుపుకునేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. సిట్టింగ్‌లలో  ముగ్గురు వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. వీరిలో నాగర్ కర్నూల్ ఎంపీ రాములు.. కుమారుడు భరత్‌కు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కి బీజేపీ సీటు కూడా ఇచ్చేసింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేయలేనని చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా  సైలెంట్ అయ్యారు. ఆయన బంధువులు కాంగ్రెస్ లో చేరిపోయారు. సిట్టింగ్ ఎంపీలే కాదు.. ఎంపీ స్థానానికి పోటీ చేసే స్థాయి ఉన్న  నేతలు కూడా పార్టీ వీడిపోతున్నారు.  హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ సీటులో బొంతు శ్రీదేవి కాంగ్రెస్ నుంచి నిలిచే అవకాశముందనే వార్తలూ వినిపిస్తున్నాయి. మరోవైపు చెవెళ్ల పార్లమెంటు బరిలో ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.  అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ ను పొగుడుతూ రాజకీయం చేసిన   ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సొంత సీటులో మారిన రాజకీయాలతో కేసీఆర్ పేరే ఎత్తటం లేదు. తెలగాణలో ముస్లింల  ఓటు  బ్యాంక్ చాలా కీలకం. మజ్లిస్ సహకరిస్తే.. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్  వంటి చోట్ల.. కాంగ్రెస్ పార్టీ ..  డామినేట్  చేసే అవకాశం ఉంది. మజ్లిస్ పాలసీ ప్రకారం అధికార పార్టీకే అండగా ఉంటుంది. హైదరాబాద్ స్థానంలో మాత్రమే.. అసదుద్దీన్త  నిలబడి.. మిగిలినచోట్ల కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండే అవకాశం ఉంది. ఇదిబీఆర్ఎస్ బలాన్ని మరింత తగ్గించడమే అవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 10 సీట్లలో కాంగ్రెస్ 4, బీజేపీ 4 గెలుచుకోగా, బీఆర్ఎస్ బలం 2 సీట్లకు పడిపోయింది.   ఈ రెండు నెలల్లో అక్కడి అనేక గ్రామ, మండల, స్థానిక సంస్థల సభ్యులు కాంగ్రెస్‌లో చేరిపోవటంతో అక్కడ అభ్యర్థిగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు.  నిజామాబాద్ సీటులో గతంలో పోటీ చేసిన కుమార్తె కవిత సైతం పోటీకి సిద్ధపడటం లేదు.  మరెవరూ ఆ సీటు అడగడం లేదు. బండి సంజయ్ సిట్టింగ్‌గా ఉన్న కరీంనగర్‌ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో 4 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్ గెలిచాయి. బిఆర్ఎస్  మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కే చాన్సిచ్చారు. మెదక్ ఎంపీ సీటు పరిధిలోని 7 స్థానాల్లో కేవలం మెదక్ సీటు తప్ప అన్నీ బీఆర్ఎస్ గెలుచుకుంది. ఎలాంటి పరిస్థితిలోనూ బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నా.. అభ్యర్తి విషయంలో మాత్రం పీట ముడిపడిపోయింది.  జహీరాబాద్ ఎంపీ పరిధిలోని సెగ్మెంట్లలో 4 కాంగ్రెస్ చేతిలో, ఒకటి బీజేపీకి దక్కగా బీఆర్ఎస్ బాన్స్‌వాడ, జహీరాబాద్ సీట్లకే పరిమితమైంది. దీంతో అక్కడా సీటు తీసుకునేందుకు ఎవరూ సాహసించటం లేదు. సిట్టింగ్ ఎంపీ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.నల్గొండ, భువనగిరి, ఖమ్మం సీట్ల కోసం ఒక్క దరఖాస్తు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి ఖమ్మం, నల్గొ్ండ జిల్లాల్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే   కాంగ్రెస్ బాట పట్టటంతో అక్కడ నామా నాగేశ్వరరావుకే టిక్కెట్ ఖరారు చేశారు. కానీ  ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది.  మహబూబ్ నగర్ సీటు, వరంగల్లు, మహబూబాబాద్‌లోనూ అదే పరిస్థితి. సికింద్రాబాద్ సీటు నుంచి తలసాని సాయిని బరిలో దించాలని పార్టీ భావిస్తున్నారు.   ఈ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే.. మరో 5 ఏళ్ల నాటికి పార్టీ నామరూపాల్లేకుండా పోయేలా ఉందనేది  ఎక్కువ మంది భావన. ఈ పరిస్థితి నుంచి కేసీఆర్ గట్టెక్కాల్సి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్