Tuesday, February 17, 2026

 ఏడు నెలలు…148 మంది అధికారులు…ప్రతి 3 రోజులలో ఇద్దరు ట్రాప్

- Advertisement -

 ఏడు నెలలు…148 మంది అధికారులు
ప్రతి 3 రోజులలో ఇద్దరు ట్రాప్
కొనసాగుతున్న ఏసీబీ దూకుడు
హైదరాబాద్, ఆగస్టు5, ( వాయిస్ టుడే)

Seven months...148 officers...two trapped every 3 days

తెలంగాణ ఏసీబీ జనవరి నుంచి జూలై వరకు 148 కేసులు నమోదు చేసింది. 93 ట్రాప్ కేసులు, 9 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, 15 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 11 రెగ్యులర్ ఎంక్వైరీలు, 17 ఆకస్మిక తనిఖీలు ఉన్నట్లు వెల్లడించింది.గత కొద్ది నెలలుగా తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. అవినీతి అధికారులను పక్కాగా పట్టేసుకునే పనిలో ఉంటోంది. గతేడాది కూడా భారీగానే కేసుల సంఖ్య నమోదైంది. ఈ ఏడాదిలోనూ ఎక్కువ సంఖ్యలోనే అధికారులు, సిబ్బంది చిక్కుతున్నారు. జనవరి నుంచి జూలై నెల వరకు నమోదైన కేసుల వివరాలను ఏసీబీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.తెలంగాణ అవినీతి నిరోధక శాఖ… (ఏసీబీ) జూలైలో 13 ట్రాప్ కేసులు నమోదు చేసింది. అంతేకాకుండా ఒక ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ఒక క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు, ఒక సాధారణ విచారణ, ఆరు ఆకస్మిక తనిఖీలతో సహా మొత్తం 22 కేసులను నమోదు చేసింది.ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు/ప్రైవేటు వ్యక్తులతో సహా 20 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ అధికారి ఒకరు తెలిపారు. వివిధ శాఖల ట్రాప్ కేసుల్లో రూ.5.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల కేసులో రూ.11.5 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఆర్టీఏ చెక్ పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.1.49 లక్షలు పట్టుబడ్డాయి.2025 జనవరి నుంచి జూలై మధ్య కాలంలో ఏసీబీ 148 కేసులను నమోదు చేసింది. 93 ట్రాప్ కేసులు, 9 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, 15 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 11 రెగ్యులర్ ఎంక్వైరీలు, 17 ఆకస్మిక తనిఖీలు మరియు 3 వివేకవంతమైన విచారణలు ఉన్నాయి. 10 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు / ప్రైవేట్ వ్యక్తులతో సహా 145 మంది ప్రభుత్వ ఉద్యోగుల ట్రాప్ కేసులలో 30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.2025 జూలైలో…. 21 కేసులను ఖరారు చేసి తుది నివేదికలను ఏసీబీ ప్రభుత్వానికి పంపింది. జనవరి 2025 నుంచి జూలై 2025 మధ్య కాలంలో నమోదైన కేసులను కూడా ఖరారు చేసి తుది నివేదికలను ప్రభుత్వానికి అందజేసింది.ఏసీబీ డైరెక్టర్ జనరల్… ఈ నెల 23న అర్ధ వార్షిక క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను సమీక్షించి దర్యాప్తు వేగవంతం చేసి ప్రధాన కార్యాలయానికి నివేదికలు సమర్పించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. అధికారుల పనితీరును కూడా అభినందించారు.ఇక 2024 ఏడాదిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో లంచాలకు మరిగిన సుమారు 170 మంది అధికారులను అరెస్టు చేసింది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల్లో ఎక్కువమంది అధికారులు అవినీతికి పాల్పడ్డారు. ఏసీబీ అరెస్టు చేసిన వారిలో ఈ శాఖ అధికారులే ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ ఏడాది నమోదయ్యే కేసుల సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది..!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్