Sunday, October 27, 2024

ట్రైన్ లో అమ్మాయి పై లైంగిక దాడి

- Advertisement -

Sexual assault on girl in train :

విశాఖ ఎక్సప్రెస్ ట్రైన్ లో శ్రీకాకుళం అమ్మాయి పై లైంగిక దాడికి యత్నం – మద్యం మత్తులో

ట్రైన్ నుంచి జారి క్రిందపడిన మహిళ

*లైంగిక దాడికి యత్నించిన వ్యక్తి కూడా ట్రైన్ నుండి క్రింద పడిన వైనం*

విశాఖ ఎక్స్ ప్రెస్ రైల్లో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

రైల్వే పోలీసుల కథనం ప్రకారం..

సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ మంగళవారం రాత్రి 7గంటలకు మిర్యాలగూడ స్టేషన్కు చేరుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైలు వేగం తగ్గింది. అదే సమయంలో ఎస్-2 బోగీలో ప్రయాణిస్తున్న ఓ మహిళ వాష్రూమ్ నుంచి తన సీటు వద్దకు వెళ్తుండగా డోర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఒడిశాకు చెందిన బిశ్వాస్.. ఆమె నడుము పట్టుకుని కిందకు లాగాడు. ఈ క్రమంలో ప్రయాణికురాలు రైలు నుంచి కిందపడిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బిశ్వాస్ కూడా రైలు నుంచి కిందపడ్డాడు. గాయపడిన బాధితురాలు సమీపంలోని తండా వద్దకు నడుచుకుంటూ వెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వారు వెంటనే రైల్వేర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రైల్వే ఎస్ఐ పవన్ కుమార్రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని మహిళను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. రైలు పట్టాలపై కొంత దూరంలో మద్యం మత్తులో పడి ఉన్న బిశ్వాస్ను మరో అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్