- Advertisement -
జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్
Shock for YCP in Jaggaiyapetజగ్గయ్యపేట
జగ్గయ్యపేటలో వైకాపాకు షాక్ తగిలింది.
మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, పలువురు వార్డు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి.రమాదేవి దంపతులు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ పడనివిధంగా భారీ వర్షాలు కురిశాయి. ప్రభుత్వ అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచింది. వరదలోనూ జగన్ రెడ్డి బురద రాజకీయాలు చేశారని మండిపడ్డారు.
- Advertisement -




