Tuesday, May 20, 2025

రాజన్న ఆలయంలో మరికాసేపట్లో సీతారాముల కల్యాణం

- Advertisement -

రాజన్న సిరిసిల్ల: వేములవాడ (Vemulawada) రాజన్న సన్నిధిలో నేడు శ్రీ సీతా రాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం 11:59 ని అభిజిత్ సుముహూర్తమున స్వామి వారి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదురుగా కల్యాణ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరుగనుంది. కల్యాణంలో హిజ్రాలు, జోగినిలు, శివపార్వతులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. నేడు ఆలయంలో కోడె మొక్కు మినహా అన్ని పూజలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్