- Advertisement -
రాజన్న సిరిసిల్ల: వేములవాడ (Vemulawada) రాజన్న సన్నిధిలో నేడు శ్రీ సీతా రాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం 11:59 ని అభిజిత్ సుముహూర్తమున స్వామి వారి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదురుగా కల్యాణ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరుగనుంది. కల్యాణంలో హిజ్రాలు, జోగినిలు, శివపార్వతులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. నేడు ఆలయంలో కోడె మొక్కు మినహా అన్ని పూజలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
- Advertisement -