మంచికంటి నగర్ లో తుమ్మల ప్రచారం

- Advertisement -
మంచికంటి నగర్ లో తుమ్మల ప్రచారం

ఖమ్మం
మంచి కంటి నగర్ లో కాంగ్రెస్ అభ్యర్ది తుమ్మల నాగేశ్వర రావు ఎన్నికల ప్రచారం సోమవారం నిర్వహించారు. తుమ్మల మాట్లాడుతూ నేను అధికారంలో ఉన్నప్పుడు మున్నేరుకు వరదలు వచ్చాయి.. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా వరదలు వచ్చాయి. ఈ గురువుగారు వయ్యారి భామ తొమ్మిది సంత్సరాలు నుండి ఇక్కడే ఉంటున్నాడు. తొమ్మిది రోజుల్లో ఎన్నికలు వస్తాయి అనగా గబగబా శంకుస్థాపన చేసిండు. మన కుటుంబాలు నాశనం అయ్యాక మనం మునిగి పోయాక ఎన్నికలు వస్తున్నాయి అని నోటిఫికేషన్ కు ముందు శంకుస్థాపన చేసిండు. పదవి కాలం ఐదు సంవత్సరాలే మళ్ళీ వస్తా అంటే కుదరదు వయ్యారి భామ అని సిట్టింగ్ ఎమ్మెల్యేపై విమర్శలు కురిపించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular